Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Prasadam: హైదరాబాద్లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని స్పీకర్ క్వాటర్స్ వద్ద నాయకులు సమావేశమయ్యి అక్కడ నుంచి నాంపల్లి కి బయలుదేరుతారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేపప్రసాదాన్ని ఆస్తమా రోగులకు అందించేందుకు నేడు, రేపు అనగా 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిద్దం చేశారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నిన్నటి నుంచే నాంపల్లి గ్రౌండ్ కు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం నిన్న రాత్రి నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
Read also: Sharwanand: హీరో శర్వానంద్కు బిరుదు.. ఏ స్టార్ అంటే?
అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బత్తిన కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఈ చేప మందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్గౌడ్ తమ తాతగారికి ఈ మందు తయారు చేసే విధానాన్ని ఓ సాధువు నేర్పించారని పురాణం. అయితే ఆస్తమా రోగులకు ఈ మందు ఉచితంగా ఇస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని, అప్పటి నుంచి ఈ చేప ప్రసాదం ఉచితంగా ఇస్తున్నామన్నారు. హరినాథ్ గౌడ్ ఇటీవల మృతి చెందినప్పటికీ… ఈ ఏడాది ఆయన కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేయనున్నారు.
కాగా.. చేప ప్రసాదం కోసం ఏటా వేలాది మంది వస్తుంటారు. కానీ చేప నైవేద్యంలో ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి కుటుంబీకులు ఉచితంగా అందజేస్తారు, అయితే చేపలను సొంతంగా కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలోని ప్రత్యేక స్టాళ్లలో కొర్రమీను, చేప పిల్లలను విక్రయిస్తున్నారు. మృగశిరకర్త నుండి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. వర్షంతోపాటు చల్లటి గాలులు వీస్తుండటంతో ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మృగశిరకార్తె ప్రారంభం రోజున ఈ మందు పంపిణీ చేస్తారు.
Secendrabad: సిగ్నల్ పడుతుందని స్పీడ్ పెంచిన డ్రైవర్.. మూడు సార్లు పల్టీ కొట్టిన కారు..
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!