Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
Fish Prasadam: హైదరాబాద్లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని స్పీకర్ క్వాటర్స్ వద్ద నాయకులు సమావేశమయ్యి అక్కడ నుంచి నాంపల్లి కి బయలుదేరుతారు. కాగా.. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనున్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్తమాతో సహా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప మందు చాలా సంవత్సరాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ చేపప్రసాదాన్ని ఆస్తమా రోగులకు అందించేందుకు నేడు, రేపు అనగా 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిద్దం చేశారు. ఈ చేపమందు ఆస్తమా రోగులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. నిన్నటి నుంచే నాంపల్లి గ్రౌండ్ కు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ మందును అందజేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు అధికారులు. మృగశిరకార్తె రోజున అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం నిన్న రాత్రి నుంచే వచ్చి క్యూలో వేచి ఉన్నారు.
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
Read also: Sharwanand: హీరో శర్వానంద్కు బిరుదు.. ఏ స్టార్ అంటే?
అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బత్తిన కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఈ చేప మందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్గౌడ్ తమ తాతగారికి ఈ మందు తయారు చేసే విధానాన్ని ఓ సాధువు నేర్పించారని పురాణం. అయితే ఆస్తమా రోగులకు ఈ మందు ఉచితంగా ఇస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని, అప్పటి నుంచి ఈ చేప ప్రసాదం ఉచితంగా ఇస్తున్నామన్నారు. హరినాథ్ గౌడ్ ఇటీవల మృతి చెందినప్పటికీ… ఈ ఏడాది ఆయన కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేయనున్నారు.
కాగా.. చేప ప్రసాదం కోసం ఏటా వేలాది మంది వస్తుంటారు. కానీ చేప నైవేద్యంలో ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి కుటుంబీకులు ఉచితంగా అందజేస్తారు, అయితే చేపలను సొంతంగా కొనుగోలు చేయాలి. ఇందుకోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలోని ప్రత్యేక స్టాళ్లలో కొర్రమీను, చేప పిల్లలను విక్రయిస్తున్నారు. మృగశిరకర్త నుండి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. వర్షంతోపాటు చల్లటి గాలులు వీస్తుండటంతో ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మృగశిరకార్తె ప్రారంభం రోజున ఈ మందు పంపిణీ చేస్తారు.
Secendrabad: సిగ్నల్ పడుతుందని స్పీడ్ పెంచిన డ్రైవర్.. మూడు సార్లు పల్టీ కొట్టిన కారు..
తాజావార్తలు
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో