Telangana Assembly: శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: బడ్జెట్ కేటాయింపులపై నేటి నుంచి శాసనసభలో చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు సంక్షేమం, రోడ్లు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటకం, క్రీడా శాఖలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎస్ ఆర్ డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రానికి పెట్టుబడులు, మైనింగ్ రెవెన్యూ, సబర్బన్ బస్సులను ప్రస్తావిస్తారు. మండలిలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. అప్పుడు మంత్రి హరీశ్ రావు సమాధానం చెబుతారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దయింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి.
Read also: Minister KTR: బైక్ ఎక్కిన మంత్రి కేటీఆర్.. గర్వంగా ఉందంటూ ట్విట్
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
నేటి నుంచి 3 రోజుల పాటు పన్నులపై చర్చ జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరగనుంది. 12వ తేదీ ఆదివారం నాడు ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. సభ దానిని ఆమోదిస్తుంది. దీంతో సభ ముగుస్తుంది. ఈఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అందరూ భావించినా కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమెదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైబడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమెద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలోనే ఈప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక^47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. కాగా.. ఇంత త్వారగా బడ్జెట్ సమావేశాల ముగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!