Digvijaya Singh: నేడు దిగ్విజయ్తో రేవంత్ రెడ్డి వర్గం భేటీ.. మీడియా సమావేశం రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijaya Singh: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్లో ఆయన పలువురు నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. దిగ్విజయ్ సింగ్తో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఒక్కొక్కరుగా సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర నేతలకు దిగ్విజయ్ సింగ్ సమయం కేటాయించారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం నేతలు దిగ్విజయ్ సింగ్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
పార్టీలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు. నేతలంతా కలిసి నడవాలంటే ఏం చేయాలనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సీనియర్లను అవమానిస్తున్న వైనం, కొందరు నేతలు కోవర్టులుగా పనిచేసి పార్టీని దెబ్బతీస్తున్నారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ అంశంపై చర్చించనున్నారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
Read also: Minister KTR: ఉపాధి హామీపై కేంద్రం దుష్ప్రచారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కేటీఆర్ పిలుపు
అయితే.. నేతలతో చర్చించిన అనంతరం దిగ్విజయ్ సింగ్ ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడాలని భావించినా.. వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఉదయం తాజ్ కృష్ణా హోటల్ లో దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి కొంత సంయమనం పాటించారు. దిగ్విజయ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. చర్చల తర్వాత టీ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని దిగ్విజయ్ అన్నారు. పార్టీలో నేతలంతా మాట్లాడుకునే పరిస్థితులు లేవన్నారు. తాను వివాదాల్లో చిక్కుకోనని చెప్పారు.
ఇక సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యులు వీ. హనుమంతరావు మాట్లాడుతూ.. డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చర్చించామన్నారు. పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని చెప్పమని, అందరూ కలిసి పనిచేసేలా చొరవ తీసుకోవాలని తెలిపామన్నారు. అందరినీ సంప్రదించి కమిటీ వేస్తే పంచాయతీ వచ్చేది కాదన్నారు. మునుగోడు హుజురాబాద్ ఎన్నికల ఓటమిపై సమీక్ష లేదని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని కమిటీలను తీసేయమని చెప్పలేదన్నారు. పీసీసీ కుర్చీ ఖాళీగా లేదు దానికోసం ఎవరు కొట్లాడటం లేదని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ చొరవతో పార్టీకి మేలు జరుగుతుందని తెలిపారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రావాలని కోరారు వీ. హనుమంతరావు.
Minister KTR: ఉపాధి హామీపై కేంద్రం దుష్ప్రచారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కేటీఆర్ పిలుపు
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..