Hyderabad Police : డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు.. పోలీసుల కీలక సూచనలు..
- డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు
- నకిలీ అధికారుల బెదిరింపులకు జాగ్రత్త
- సున్నితమైన వివరాలు ఇవ్వొద్దని పోలీస్ హెచ్చరిక
- సైబర్ మోసాలపై వెంటనే 1930కు రిపోర్ట్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం ఈ స్కాం కీలక లక్ష్యం. బాధితులకు వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా “అరెస్ట్ చేస్తున్నాం” అని నటిస్తూ, ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, వారెంట్లు జారీ అయ్యాయని నమ్మించి మోసం చేస్తున్నారు.
మోసగాళ్లు తమ కుట్రను బలపరచేందుకు నకిలీ FIRలు, వన్-బైలబుల్ వారెంట్లు, RBI లేఖలు వంటి కట్టుకథల డాక్యుమెంట్లు తయారు చేసి పంపిస్తారు. అనుమానం లేకుండా ఉండేందుకు కుటుంబ ప్రతిష్టకు హాని కలుగుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతారు. కేసు నుండి బయటపడాలంటే భారీ మొత్తం డబ్బు సేకరించి “సుప్రీం కోర్టుకు డిపాజిట్ చేయాలి” అని చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కుటుంబ సభ్యులకు చెప్పొద్దని హెచ్చరిస్తూ సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను వినియోగిస్తారు.
Also Read
- CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
- Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇస్తోంది.. డిజిటల్ అరెస్ట్ అనే దాంట్లో ఏమీ లేదు. నిజమైన పోలీసులు ఎప్పుడూ ఫోన్, WhatsApp లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. కాలర్ IDలు స్పూఫ్ చేయబడవచ్చు కాబట్టి ఏ అధికారిక కాల్ వచ్చినా వెంటనే నమ్మేయకూడదు. OTPలు, ఆధార్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచకూడదు. అనుమానం వచ్చిన వెంటనే కాల్ను కట్ చేసి, కాలర్ ఇచ్చిన నంబర్లకు తిరిగి కాల్ చేయకుండా, స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ అధికారిక హెల్ప్లైన్ద్వారా మాత్రమే ధృవీకరించాలి. WhatsApp మెసేజ్లు, స్క్రీన్షాట్లు, కాల్ లాగ్స్ వంటి సాక్ష్యాలను భద్రపరచడం కూడా చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు.
ఇలాంటి మోసాలు ఎదురైనపుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో
ఫిర్యాదు చేయాలని సూచించారు. తాజా అప్డేట్ల కోసం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ అధికారిక సోషల్ మీడియా పేజీలైన Facebook, Instagram, X ఖాతాలను ఫాలో కావాలని చెప్పారు. డిజిటల్ ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ మోసగాళ్ల పద్ధతులు కూడా అధునాతనంగా మారుతున్నాయి. ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ కూడా భారీ నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. అప్రమత్తతే రక్షణ.. మీ డబ్బు, మీ డేటా, మీ భద్రత మీ జాగ్రత్తల్లోనే ఉంది.
Adulterated food: హోటల్లో పాచిపోయిన ఫుడ్.. తస్మాత్ జాగ్రత్త!
తాజావార్తలు
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్పై ఆసక్తికర విశ్లేషణ!
-
Curry Leaves Storage Tips: ఈ సులభమైన చిట్కా.. కరివేపాకు నెలల తరబడి తాజాగా ఉంటుంది..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!