Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adlur Laxman Kumar: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణహాని లేదని… వారందరికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే…
Also Read
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ నిన్న (ఆదివారం) హైదరాబాద్ లో పని ముగించుకుని అర్థరాత్రి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటు మరికొందరు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే కారు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది. కారు మంచి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులోని ఎయిర్బ్యాగ్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్తో పాటు మరికొందరి ప్రాణాలు కాపాడబడ్డాయి.
లక్ష్మణ్ తలకు గాయాలు కావడంతో వెంటనే కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని… స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న ధర్మపురి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించని సభకు హాజరైన లాస్య నందిత తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సభ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ఆటోను ఢీకొట్టింది. కారు ముందుభాగం కుడివైపు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయమైంది. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతోపాటు ఆమె చెల్లెలు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
Matka Movie : ‘మట్కా’ మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన వరుణ్..
తాజావార్తలు
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..