Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adlur Laxman Kumar: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణహాని లేదని… వారందరికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే…
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ నిన్న (ఆదివారం) హైదరాబాద్ లో పని ముగించుకుని అర్థరాత్రి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటు మరికొందరు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే కారు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది. కారు మంచి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులోని ఎయిర్బ్యాగ్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్తో పాటు మరికొందరి ప్రాణాలు కాపాడబడ్డాయి.
లక్ష్మణ్ తలకు గాయాలు కావడంతో వెంటనే కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని… స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న ధర్మపురి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించని సభకు హాజరైన లాస్య నందిత తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సభ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ఆటోను ఢీకొట్టింది. కారు ముందుభాగం కుడివైపు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయమైంది. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతోపాటు ఆమె చెల్లెలు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
Matka Movie : ‘మట్కా’ మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన వరుణ్..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?