Degree student suicide: 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Degree student suicide: ఈ కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏందో వారు చేసేదే కరెక్ట్ అంటూ చిన్న పాటి విషయాలు వారికి పెద్దగా కనపడుతున్నాయి. దీంతో వారు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరైతే తమ బాధలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఉరితాడితో తనువు చాలిస్తున్నారు. ఇటువంటి ఆత్మహత్యలు ఇలా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 19 ఏళ్ల యువతి హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతుంది. అయితే అమ్మా, నాన్న చేయించిన ఉంగరం ఇటీవల పోయింది. ఇక ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లింది దీంతో ఉంగరం పోయిందని తెలుస్తే తల్లిదండ్రులు తిడతారని భయపడింది. ఏం చేయాలో తెలియక చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది ఈ ఘటన వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామంలో కలకలం రేపింది.
Read also: MP Nandigam Suresh: అచ్చెన్న హత్యపై రాజకీయం తగదు.. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది..!
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
వరంగల్ జిల్లా గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కు 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి కూతురు ఉంది. హేమలతా హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా..ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. అయితే.. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డికి వున్న చేతి ఉంగరం పోయింది. హేమలతా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉంగరం పోయిందని తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడింది. తిడతారేమో అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసింది. అందులో అమ్మా, నాన్నా నన్ను క్షమించండి ఉంగరం పోగొట్టుకున్నాను. అది తెలిస్తే మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అనంతరం వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కూతురు ఫ్యాన్ వేలాడుతూ కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కారణం ఏముంటుందనీ భావించినా తరువాత సూసైడ్ లెటర్ లో హేమలతా రాసిన రాతను చూసి అయ్యె తల్లీ వేల రూపాయల విలువ చేసే ఉంగరం కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాణమెలా తీసుకున్నావు అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇది చిన్న విషయమే కదా.. అంతగా ఎందుకు భయపడి మాకు అందనంత దూరమవుతావా అంటూ రోధిస్తున్నతీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!