Degree student suicide: 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Degree student suicide: ఈ కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏందో వారు చేసేదే కరెక్ట్ అంటూ చిన్న పాటి విషయాలు వారికి పెద్దగా కనపడుతున్నాయి. దీంతో వారు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరైతే తమ బాధలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఉరితాడితో తనువు చాలిస్తున్నారు. ఇటువంటి ఆత్మహత్యలు ఇలా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 19 ఏళ్ల యువతి హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతుంది. అయితే అమ్మా, నాన్న చేయించిన ఉంగరం ఇటీవల పోయింది. ఇక ఉగాది సెలవులకు ఇంటికి వెళ్లింది దీంతో ఉంగరం పోయిందని తెలుస్తే తల్లిదండ్రులు తిడతారని భయపడింది. ఏం చేయాలో తెలియక చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది ఈ ఘటన వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామంలో కలకలం రేపింది.
Read also: MP Nandigam Suresh: అచ్చెన్న హత్యపై రాజకీయం తగదు.. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది..!
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
వరంగల్ జిల్లా గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కు 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి కూతురు ఉంది. హేమలతా హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా..ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. అయితే.. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డికి వున్న చేతి ఉంగరం పోయింది. హేమలతా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉంగరం పోయిందని తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడింది. తిడతారేమో అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసింది. అందులో అమ్మా, నాన్నా నన్ను క్షమించండి ఉంగరం పోగొట్టుకున్నాను. అది తెలిస్తే మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. అనంతరం వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కూతురు ఫ్యాన్ వేలాడుతూ కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కారణం ఏముంటుందనీ భావించినా తరువాత సూసైడ్ లెటర్ లో హేమలతా రాసిన రాతను చూసి అయ్యె తల్లీ వేల రూపాయల విలువ చేసే ఉంగరం కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాణమెలా తీసుకున్నావు అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇది చిన్న విషయమే కదా.. అంతగా ఎందుకు భయపడి మాకు అందనంత దూరమవుతావా అంటూ రోధిస్తున్నతీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు
తాజావార్తలు
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!