Ramakrishna Case: నా తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రసక్తేలేదు: భార్గవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం కలిగించిన సస్పెండైన హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్కు తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి తెలిపింది. అయితే రామకృష్ణ హత్యకు గురయిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని, పోలీసులు ఏం మాట్లాడడడం లేదని పేర్కొంది. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యం అయింది. తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య చేయించాడని భార్గవి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతీఫ్ తన భర్తను హైదరాబాద్కు తీసుకెళ్లాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన భర్తను నమ్మించి తీసికెళ్ళాడని భార్గవి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా వుంటే.. రామకృష్ణ భార్య భార్గవి అనేక అంశాలు బయటపెట్టింది. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావు ని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా అని నన్నే ప్రశ్నించారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ రామకృష్ణ ను సంప్రదించారని భార్గవి తెలిపారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Read Also: Honour Killing: భువనగిరిలో పురువు హత్య..
లతీఫ్ ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణ కు పరిచయం చేశారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారని, రామకృష్ణను నమ్మించేందుకు అతని అకౌంట్లో డబ్బులు కూడా వేసి బయటకు తీసికెళ్ళారని భార్గవి పేర్కొన్నారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తనకు తన పుట్టింటితో సంబంధాలు లేవంటోంది భార్గవి. మేం చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు. తన భర్తను హత్య చేసినటువంటి నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. తన తండ్రి తన వద్దకు వెళ్తానని రామకృష్ణ ని హత్య చేయించి ఉంటాడు. నా భర్త ను హత్య చేస్తే తండ్రి దగ్గరకు వెళ్తాను అని అనుకున్నాడు. తన తండ్రి వద్దకు వెళ్ళే ప్రసక్తే లేదంటోంది రామకృష్ణ భార్య భార్గవి.
తాజావార్తలు
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!