సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసు కమిషనర్. కాగా, ప్రధాని మోడీ.. శనివారం హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే.. ఇక్రిశాట్ను సందర్శించనున్న ఆయన.. ఆ తర్వాత సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు.
Read Also: ఉద్యోగుల సమ్మె, పెన్డౌన్.. హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు