Srinivas Goud: మంత్రి హత్యకు స్కెచ్ ఇలా..? రూ.15 కోట్ల డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ సంచలనంగా మారిపోయింది.. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర… మహబూబ్ నగర్కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.. ఫిబ్రవరి 23వ తేదీన ఫరూక్, హైదర్ ఆలీలు సుచిత్రాలోని ఓ లాడ్జిలో దిగారని.. 25వ తేదీన లాడ్జీ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని చంపేందుకు ప్రయత్నించారన్న సీపీ.. అక్కడ తప్పించుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు.. యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ అనే మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తులు వీరిపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు అందింది. వీరిద్దరిని 26వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. రఘు మరికొందరితో కలసి హత్యకు కుట్రపన్నారని పోలీసుల విచారణలో తేలినట్టు తెలిపారు స్టీఫెన్ రవీంద్ర.
Read Also: Srinivas Goud: మంత్రి హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్..!
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇక, కేసులో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజులను ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. మిగిలిన ముగ్గురిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నామని.. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజు, అమరేందర్ కలసి మహబూబ్ నగర్ నుంచి విశాఖ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు.. అక్కడ షెల్టర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ ఇచ్చారన్న ఆయన.. ఇందులో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. రాఘవేందర్ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్.. దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో 6 రౌండ్స్ రివాల్వర్ రాజు నుంచి రికవరీ చేసి.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని.. రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలినట్టు తెలిపారు.. కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జితేందర్రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్ థాప, సౌత్ అవెన్యూలోనే షెల్టర్ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. మరోవైపు ఇందులో డీకే అరుణ పాత్రపైనా విచారణ జరుపుతామన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?