Cyber Fraud: బ్యాంక్ ఉద్యోగికే సైబర్ కేటుగాళ్ళ టోకరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసానికి ఎవరైతే నేం అన్నట్టుగా ఉంది. హనుమకొండ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. తన ఖాతాలోంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిహార్కు చెందిన సకల్దేవ్ సింగ్ పరకాల ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. హనుమకొండలోని సుబేదారిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం రాత్రి ఆయనకు ఓ మొబైల్ నంబరు నుంచి ‘మీ ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది.. పాన్ కార్డు అప్డేట్ చేయండి’ అని మెసేజ్ వచ్చింది.
Read Also:Annamayya Project: ఇక చకచకా అన్నమయ్య ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
ఆయన శుక్రవారం ఉదయం ఆ మెసేజ్ను క్లిక్ చేసి.. అప్డేట్ చేయడానికి ప్రయత్నించగా సబ్మిట్ కాలేదు. అనంతరం మరో నంబరు నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా..’నేను బస్సులో ఉన్నాను.. తర్వాత చేస్తాను’ అని సకల్దేవ్ సింగ్ చెప్పారు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆయనే తనకు వచ్చిన నంబర్కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి పాన్ కార్డు అప్డేట్ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు.ఆ వెంటనే వాట్సాప్నకు ఒక లింక్ పంపానని, దాన్ని ఓపెన్ చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు.
ఈమేరకు వేరే నంబరు నుంచి లింక్ పంపించగా.. దాన్ని ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఖాతా లోంచి 3 లావాదేవీల్లో రూ.99,990, రూ.99,990, రూ.24,987 మాయమయ్యాయి. ఈమేరకు ఆయన శుక్రవారం రాత్రి పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.కిషన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగి డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పరకాల లో అసిస్టెంట్ మేనేజర్ కు టోకరా వేశారు. మీకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే, లింక్ లు పంపాం.. ఓపెన్ చేయమని చెబితే మాత్రం మీరు స్పందించకండి. అనుమానాస్పద వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
Read Also:Nellore Church Blood: నెల్లూరు కబాడీపాలెంలో వింత.. శిలువ నుంచి రక్తం
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!