CPI Narayana: సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దాకా ఇండియా కుటుంబం ఉంటుంది కానీ కూటమిలో కొంతమంది పోవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా శతవు ఉంటే అది బీజేపీ అన్నారు. తెలుగు ప్రజానీకానికి ఒక బద్ధ శత్రువు లాగా బిజెపి మారిందని మండిపడ్డారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కెసిఆర్ .. బీజేపీని కౌగిలించుకున్నారు కాబట్టి ఓడిపోయారన్నారు. బిజెపిది ధృతరాష్ట్రుడి కౌగిలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళింది కాబట్టే విజయం సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిలో చిత్తశుద్ధిగా పనిచేసే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనగా మారాయన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెపొందించారని మండిపడ్డారు. కాబినెట్ లో కూడా మతాన్ని రాజకీయం చేశారన్నారు. ఏ రాజ్యాంగానికి లోబడి ఎన్నికయ్యారో దానికి మూడు నామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం,రాజకీయం ఒకటి చేశారని తెలిపారు.
Read also: Tamilisai: జాతీయ ఓటరు దినోత్సవంలో గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికల ఘటనపై ప్రస్తావన..!
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
అయోధ్య రామాలయం నిర్మాణము కు మేము వ్యతిరేకం కాదన్నారు. అన్ని ఊరల్లో రామాలయలు ఉన్నాయని, ఒక ఈవెంట్ లాగా రామాలయం ఓపెనింగ్ మోడీ,యోగి చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు ఘటనలో అద్వానీ ఉన్నారు,అలాంటి అద్వానీ రామాలయం ఓపెనింగ్ రాలేదని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం బాబ్రీ మసీదు కులగొట్టిన అంశాన్ని చూశారన్నారు. అయోధ్య తీర్పు ఇచ్చిన వారిలో ఒకరు రాజ్యసభ లో,మరొకరు ఏపీ గవర్నర్ గా ఉన్నారని తెలిపారు. అయోధ్య రామాలయం ప్రారంభానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచన చేయాలన్నారు. మోడీ బ్లాక్ మెయిల్ తో కొందరు వెనక్కి వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా అందరిని కలుపుకొని పోవాలన్నారు. సెక్యూలర్ అని చెప్పుకునే వారు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!