CPI Narayana: పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తామని, సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నారాయణ మండిపడ్డారు. హన్మకొండలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాలసముద్రం ఏకాశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.
ఈ ధర్నలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నలో గుడిసె వాసులు భారీగా తరలి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ.. భూ పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఏకశిలా పార్కు నుండి కలెక్టరేట్ ముట్టడికి వెల్లుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏకశిలా పార్క్ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు గుడిసె వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్దంగా పోరాడుతున్నం.పేద ప్రజల ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోంది అన్నారు. ప్రభుత్వంతో చావో,రేవో తేల్చుకుంటాం అని నారాయణ తెలిపారు. ఉంటే గుడిసెలో లేకుంటే జైల్లో ఉంటాను. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం కాకపోతే, తుపాకులు చేతపడుతామని నారాయణ హెచ్చరించారు.సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక,జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీకి పోతున్నాడని విమర్శించారు.
పేదలకు అండగా ఉండల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందని ఆరోపించారు.ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే, మాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడడానికి వస్తే మాపై దాడులు చేస్తారా.. వరంగల్ పోరుగడ్డ, భూ పోరాటాలకు ఇక్కడే నాంది పలుకుతాం. జక్కలోద్దిలో పేదల ఇండ్లను కాల్చడం దారుణం అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!