ఈరోజు నుండి లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సడలింపు సమయంలోనే ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. అలా చేసే వారి పై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉంది. అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తర్వాత కోర్టు నుండి తీసుకోవాలని తెలిపారు. అయితే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులను కూడా లాక్ డౌన్ సమయంలో మూసేయనున్నారు.