Crops Loss: అకాలవర్షం. ఆందోల్ పత్తి రైతులకు అపారనష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెల్లబంగారం పంట చేతికొచ్చే సమయంలో ఈ ఆకాల వర్షం దెబ్బతీసి రైతులను నష్టాల పాలు చేసింది. ఇరవై రోజులైతే పత్తిపంట చేతికొచ్చేది. అంతలోనే వర్షానికి ఆహుతైంది. దీంతో ఆందోల్ రైతన్నకు చెప్పుకోలేనంత దెబ్బతగిలింది. ఈ ఏడాది వర్షాకాలంలో పత్తి పంట విత్తిన సమయంలో సరిపోను వర్షాలు కురవడం వల్ల రైతులను మురిపించిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల కారణంగా ఆగంచేసింది. నల్ల రేగడి భూముల్లో పంట కాయదశలో ఉండగా చేలుక భూముల్లో పత్తి విప్పింది. మొన్నటి వరకు ఉన్న పత్తి పంటలను చూసి లాభాల బాట పడుతామని అనుకుంటే తమకు తీరని కష్టం వచ్చిందని వాపోతున్నారు రైతన్నలు.
ఈ ఏడాది వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరుతాయని సంబర పడ్డ రైతులు వర్సాల వల్ల నష్టాల ఉబిలోకి నెట్టేశారు. చేతికొచ్చిన పంటను తీద్దామనుకుంటే అది నల్ల బోయిందని.. ఇది ఎవరు కొంటారని మాకొద్దు మీరే తీసుకెళ్లండి. అంటారేమో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పత్తి పంట నీటిలో మునిగిపోవడం వల్ల పత్తి కాయలు నల్లగా మారిపోయాయి. విప్పిన పత్తి సైతం నల్లబారుతోంది.
Also Read
Read Also: Crops Loss: అకాలవర్షం. ఆందోల్ పత్తి రైతులకు అపారనష్టం
తెలంగాణ వ్యవసాయ శాఖ చేపట్టిన ఇ- క్రాప్ నమోదు ప్రకారం సంగారెడ్డి జిల్లాలో 3.47 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. రాయికోడ్ డివిజన్ పరిధిలోని రాయికోడ్ మండలంలో 35.892,మునిపల్లి మండలంలో 33.871, వట్ పల్లి మండలంలో 22.340 వేల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. మొత్తం డివిజన్ లో 92.106 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. ఈ డివిజన్ లో అధికంగా పంట సాగు చేయడమే కాకుండా అదే తరహాలో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!