Coronavirus: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళణ చెందుతున్నారు. ఈ నాలుగు కేసులలో ఒకరి రికవరి అయినట్టు జిల్లా వైద్యాధికారలు తెలిపారు. దీంతో ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్గా ఉంది. దీంతో కరోనా సోకిన వారి కాంటాక్ట్ హిస్టరీని అధికారులు పరిశీలిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్తో ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నా.. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొటి చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,322 కొవిడ్ టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్గా బయటపడ్డాయి. మరో 38 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్డీ, గాంధీ ఆస్పత్రికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Also Read
తాజావార్తలు
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!