Kamareddy: రైతులపై బ్యాంకు అధికారుల కఠినత్వం.. రుణం చెల్లించలేదని భూముల వేలం
- కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంకు అధికారుల కాఠిన్యం
- రుణం చెల్లించినందుకు రైతుల భూముల అమ్మకానికి సిద్ధం
- పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అధికారులు
- రుణ బకాయిలు ఉన్న భూముల వేలంపాటకు ఏర్పాట్లు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్కు అంటిస్తారు. అది కూడా లేదంటే నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకబు చేస్తారు. కానీ, కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంట సాగుకు కోసం డిస్ట్రిక్ కొ-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సహకార బ్యాంకు నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసింది. దీంతో రైతులు రుణాలు ఎవరూ డబ్బు కట్టపోవడంతో బ్యాంక్ అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం, పొల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు.
Read also: Gautham Ghattamaneni: వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో భూములను వేళం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. పొట్ట నింపే రైతుల భూమిని లాక్కుంటే కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు నేల పాలైందని కన్నీరుమున్నీరుగా విలపించాలరు. ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని వాపోతున్నారు. అన్నం పెట్టే రైతన్ననే ఇలా రోడ్డుకు లాగితే.. ఆకలికే అంతులేకుండా పోతుందని అంటున్నారు. భూమినే నమ్మకుని బతుకుతున్నామని ఇప్పుడు ఆ భూమికూడా బ్యాంక్ అధికారులు లాక్కుంటే చిన్నపిల్లలు కుటుంబంతో సహా రోడ్డున పడాలి అంటున్నారు. రుణాలు చెల్లించకపోతే పొలాల్లోకి వచ్చి జెండాలు పెట్టడం ఏంటని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పోలాలను వేళం వేయకుండా ఆపాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది వేచి చూడాలి.
Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ పొత్తుకు బీటలు.. మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ కథనం..
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..