Congress Training Classes: నేడు కాంగ్రెస్ శిక్షణ తరగతులు.. సీనియర్ల హాజరుపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Training Classes: బోయినిపల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, మరియ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన, శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు, జోడో అభియాన్ జాతీయ సమన్వయ కర్త గిరీష్ ఛాడొంకర్ తదితరులు పాల్గొంటారు. అయితే.. ఇవాళ బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు నేడు జరిగే మీటింగ్ కు వెళ్లాలా ? వద్దా ? అనే సమాలోచనలో ఉన్నారు.
Read also: Pathaan: పఠాన్కి షాకిచ్చిన CBFC.. సినిమా వాయిదా?
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ఇక తాజాగా.. ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడిన అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చేతులెత్తి మొక్కుతున్నా అంటూ దిగ్విజయ్ సింగ్ కోరారు. సీనియర్లతో పీసీసీ చీఫ్ వరుస సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ పర్యటన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు సీనియర్లు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లో ఇంకా సమ్మతి లేదని అసమ్మతి కొనసాగుతోందని తెలుస్తోంది. మరి ఖర్గే ఫోన్ కాల్ తో అయినా కాంగ్రెస్ నాయకులు మళ్లీ కలుస్తారా? అసలు కాంగ్రెస్ శికణ తరగతులకు హాజరు అవుతారా? అనే విషయం పై ఉత్కంఠత నెలకొంది.
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?