Congress Training Classes: నేడు కాంగ్రెస్ శిక్షణ తరగతులు.. సీనియర్ల హాజరుపై ఉత్కంఠ
Congress Training Classes: బోయినిపల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, మరియ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన, శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు, జోడో అభియాన్ జాతీయ సమన్వయ కర్త గిరీష్ ఛాడొంకర్ తదితరులు పాల్గొంటారు. అయితే.. ఇవాళ బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు నేడు జరిగే మీటింగ్ కు వెళ్లాలా ? వద్దా ? అనే సమాలోచనలో ఉన్నారు.
Read also: Pathaan: పఠాన్కి షాకిచ్చిన CBFC.. సినిమా వాయిదా?
Also Read
- Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుకు హైకోర్టులో ఊరట
- TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
ఇక తాజాగా.. ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడిన అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చేతులెత్తి మొక్కుతున్నా అంటూ దిగ్విజయ్ సింగ్ కోరారు. సీనియర్లతో పీసీసీ చీఫ్ వరుస సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ పర్యటన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు సీనియర్లు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లో ఇంకా సమ్మతి లేదని అసమ్మతి కొనసాగుతోందని తెలుస్తోంది. మరి ఖర్గే ఫోన్ కాల్ తో అయినా కాంగ్రెస్ నాయకులు మళ్లీ కలుస్తారా? అసలు కాంగ్రెస్ శికణ తరగతులకు హాజరు అవుతారా? అనే విషయం పై ఉత్కంఠత నెలకొంది.
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
తాజావార్తలు
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
-
Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్ఫోలియోలో రూ.20 లక్షలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!