Municipal Elections : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా
- 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
- పలుచోట్ల క్లీన్ స్వీప్
- మెదక్ జిల్లాలో భారీ ఆధిక్యం
- నర్సాపూర్లో హోరాహోరీ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో ‘హస్తం’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు, తాము ఆశించిన 85-90 స్థానాల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యంగా ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, భీంగల్, మరిపెడ, దోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్కర్నూల్ వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్లయ్యింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలను సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా, సదాశివపేటలో 26 వార్డుల్లో 16 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాలు ఇక్కడ అద్భుతంగా ఫలించాయి. ఇక్కడ ఎంఐఎం (MIM) పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం గమనార్హం. అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గమైన జోగిపేటలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి తన పట్టును నిరూపించుకుంది. ఇక నర్సాపూర్లో మాత్రం ఫలితాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఒక వార్డులో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా అక్కడ హంగ్ ఏర్పడింది.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!