Municipal Elections : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా
- 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
- పలుచోట్ల క్లీన్ స్వీప్
- మెదక్ జిల్లాలో భారీ ఆధిక్యం
- నర్సాపూర్లో హోరాహోరీ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో ‘హస్తం’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు, తాము ఆశించిన 85-90 స్థానాల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యంగా ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, భీంగల్, మరిపెడ, దోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్కర్నూల్ వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్లయ్యింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలను సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా, సదాశివపేటలో 26 వార్డుల్లో 16 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాలు ఇక్కడ అద్భుతంగా ఫలించాయి. ఇక్కడ ఎంఐఎం (MIM) పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం గమనార్హం. అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గమైన జోగిపేటలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి తన పట్టును నిరూపించుకుంది. ఇక నర్సాపూర్లో మాత్రం ఫలితాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఒక వార్డులో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా అక్కడ హంగ్ ఏర్పడింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!