Municipal Elections : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా
- 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
- పలుచోట్ల క్లీన్ స్వీప్
- మెదక్ జిల్లాలో భారీ ఆధిక్యం
- నర్సాపూర్లో హోరాహోరీ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో ‘హస్తం’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు, తాము ఆశించిన 85-90 స్థానాల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యంగా ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, భీంగల్, మరిపెడ, దోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్కర్నూల్ వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్లయ్యింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలను సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా, సదాశివపేటలో 26 వార్డుల్లో 16 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాలు ఇక్కడ అద్భుతంగా ఫలించాయి. ఇక్కడ ఎంఐఎం (MIM) పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం గమనార్హం. అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గమైన జోగిపేటలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి తన పట్టును నిరూపించుకుంది. ఇక నర్సాపూర్లో మాత్రం ఫలితాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఒక వార్డులో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా అక్కడ హంగ్ ఏర్పడింది.
తాజావార్తలు
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?