Congress : దేశంలోని కీలక అంశాలపై కాంగ్రెస్ న్యాయ సదస్సు
- రేపు ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరగనున్న సదస్సు
- రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు భావనలు , పరిష్కార మార్గాలు అనే థీమ్ పై సదస్సు
- సదస్సులో ప్రసంగించనున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లు
- లీగల్ సెల్ సదస్సులో ప్రసంగించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు.. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు..
కాంగ్రెస్ న్యాయ సదస్సును మొత్తం ఐదు సెషన్లుగా విభజించారు
Also Read
1. సామాజిక న్యాయం & రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు
2. మతం & రాజ్యాంగం: నియంత్రణలు, మార్గదర్శకాలు
3. అధికార విభజన, ప్రజాస్వామ్య బాధ్యత: సమాఖ్య వ్యవస్థ దిశ?
4. న్యాయ స్వతంత్రత & రాజ్యాంగ సంస్థల అశక్తతపై చర్చ
5. వాలెడిక్టరీ సెషన్: “రాజ్యాంగ దిక్సూచి: ప్రజాస్వామ్య భారత పట్ల కాంగ్రెస్ నిబంధిత విధేయత”
ఇలా న్యాయపరమైనటువంటి అంశాలపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ప్రసంగిస్తారు.. అంతేకాదు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎజెండా అంశాలపై ప్రసంగిస్తారు.. సదస్సులో మొత్తం 41 మంది ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమావేశంలో మాజీ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొననున్నారు..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే, ఏ సదస్సు భారత ప్రజాస్వామ్య యాత్రలో ఒక కీలక ఘట్టమని, దేశ ప్రజాస్వామ్య పునాది విలువలకు మళ్లీ కట్టుబడి నిలబడాల్సిన సమయమని చెప్తున్నారు రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిషేక్ మను సింగ్బి.. అయితే శనివారం ఢిల్లీలో జరిగే సదస్సు పార్టీ సభ కాకుండా, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు అవసరమైన చర్చలకు అవకాశం కల్పించే బహుముఖ వేదిక అని సింగ్వి తెలిపారు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!