బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్ అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అమిత్ షా నీ కలిసింది వాస్తవమే, కానీ..నా మిత్రుడితో కలిశానంటూ చెప్పుకొచ్చారు. రాజీనామా… రాజకీయాలు అమిత్ షా తో చర్చకు రాలేదని తెలిపారు. తెలంగాణ. ఉద్యమంలో నేను చేసిన పోరాటం పై చర్చించామంటూ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటని చర్చ జరిగిందని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పులకు దిగజారిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందని అమిత్ షా అడిగారని అన్నారు. ఎన్నో ఏండ్లుగా అడుగుతున్న గట్టుపల్ నీ మండల కేంద్రం చేశారు, ఉప ఎన్నికల హంగామా అంతా చేస్తున్నారు, మునుగోడు నియోజక వర్గంలో చీలికలు చేస్తున్నారు, అమిత్ షా నీ కలవగానే.. కెసిఆర్ కి ఎందుకు అంత భయం పుట్టుకొస్తుందా అంటూ ఎద్దేవ చేసారు.
read also: Udugula Venu: సాయిపల్లవి ఫోటోను ట్విట్ చేసిన డైరెక్టర్.. ట్రెండింగ్ లో పోస్ట్
హుజూరాబాద్ లో పోయిన ప్రతిష్ట, మునుగోడు లో నిలబెట్టుకోవాలని చూస్తున్నారా..!? అంటూ విమర్శించారు. పీకే సర్వే లోనే… కెసిఆర్ గ్రాఫ్ పడిపోయిందని వచ్చిందని గుర్తుచేసారు. బీజేపీకి గతంలో అనుకూల ప్రకటన ఇచ్చిన.. కానీ చేరిక గురించి ఎక్కడా మాట్లడలేదని, ఎన్నికలో ఎట్లా గెలవాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. అమిషాను కలిసినప్పటి నుండి కెసిఆర్ కి నిద్ర పట్టడం లేదని వ్యంగ్యంగా చురుకలంటించారు. నా రాజీనామా భయం తో గట్టుప్పల్ మండలం వచ్చేసిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండి అంటూ ఎద్దేవ చేసారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. యెనిమిది ఎండ్లాలో కెసిఆర్ లక్షల కోట్లు సంపాదించారనిచ వచ్చే రోజుల్లో అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Agnipath Scheme: దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన ఐఏఎఫ్ అగ్నివీర్ ఎగ్జామ్