Jagga Reddy: మోడీ, కేసీఆర్ లెవల్లో చీకటి ఒప్పందం..! కాంగ్రెస్ లేకుండా చేసే కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. ఏ పార్టీ నేతలు మాట్లాడినా.. ఇప్పుడు మునుగోడును లింక్ చేసే మాట్లాడుతున్నారు.. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, టీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ లెవల్లో చీకటి ఒప్పందం జరిగిందని విమర్శించారు.. బీజేపీ, టీఆర్ఎస్ వంద కోట్లు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాయని మండిపడ్డారు.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి అని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.
Read Also: School Girl Marriage At Bus Stop: బస్టాండ్లోనే స్కూల్ విద్యార్థినికి తాళి కట్టేశాడు.. అంతా షాక్..
Also Read
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
ఇక, టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బులు ప్రజలవేనని ప్రజలు గమనించాలని సూచించారు జగ్గారెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేసీఆర్ ది… సెంట్రల్ ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీది.. దీంతో, మేం ఏం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇచ్చే డబ్బులను తీసుకోండి… కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. డబ్బులు పంచితే ఓట్లు వేయరు అని సంకేతం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు.. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి ఎవరు రాకున్నా.. కాంగ్రెస్ కి నష్టం లేదు అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు పోటీలో ఉన్నాడు కాబట్టి ప్రచారానికి రాలేను అని అధిష్టానానికి చెప్పారట.. ఫ్యామిలీ ప్రాబ్లమ్ వస్తుంది అని పోవడటం లేదు అని చెప్పారట అన్నారు.. అయితే, అధిష్టానానికి చెప్పారు అని వార్తలు తాను చూశాను.. అధిష్టానం అంగీకారం చెప్పిందో లేదో నాకు తెలియదు అన్నారు జగ్గారెడ్డి.
చండూర్ లో పార్టీ ఆఫీసు తగల బెట్టడం వెనక టీఆర్ఎస్, బీజేపీలు ఉన్నాయని మండిపడ్డారు జగ్గారెడ్డి.. పోలీసులు కేసీఆర్ చెప్పినట్టు వింటారని.. మోడీ దగ్గరా కూడా పోలీసు ఉందన్నారు.. టీఆర్ఎస్, బీజేపీలకు రెండు హోమ్ శాఖలు చేతిలో ఉన్నాయని ధీమాతో ఉన్నాయని.. మా దగ్గర ఏ హోం శాఖ లేదు అని వాళ్ల ధైర్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దాడులు చేసి సంస్కృతి మాకు లేదని.. మేం చేస్తే కేసులు, రిమాండ్ చేస్తారన్న ఆయన.. కొందరు పోలీసులు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వెనకాల ఉండి చేస్తున్న దాడులే ఇవి.. పోలీసుల మద్దతు లేకుండా జరిగే పని కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!