Jagga Reddy: బీఆర్ఎస్పై జగ్గారెడ్డి సెటైర్లు.. ఆ పార్టీల్లాగే తుస్సుమంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Jagga Reddy Satires On BRS Party: టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఎన్నికల కమిషన్కు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా.. అనుమతి లభిస్తుందని బీఆర్ఎస్పై పరోక్షంగా సెటైర్ వేశారు. జాతీయ రాజకీయాల్లో రావాలని టీఆర్ఎస్ వాళ్లు అనుకుంటున్నారని.. అయితే జాతీయ స్థాయిలో రాణించాలనుకున్నా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇప్పటివరకూ రాణించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ లాంటి వారు జాతీయ పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారని.. ఇప్పుడు బీఆర్ఎస్కు కూడా అదే గతి పడుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయని.. అవి కాంగ్రెస్, బీజేపీ అని తేల్చి చెప్పారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడానికి కారణం ఎంఐఎం, ఇతర పార్టీలేనని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ హైదరాబాద్ కూడా దాటని ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తోందని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. గుజరాత్లో బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే అక్కడ గెలుస్తోందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని.. అయితే టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు రాకుండా బీజేపీకి పోయేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన బలం, మీడియాతో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీకి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ వచ్చినా పర్లేదు కానీ.. కాంగ్రెస్ మాత్రం రావొద్దని అన్నట్లుందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై.. డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
అంతకుముందు.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్లను ఎదుర్కొనే వ్యూహాలపై తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం దర్యాప్తు సంస్థలతో దాడులు చేసుకోవడం వల్ల.. తెలంగాణలో ఆ రెండు పార్టీలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయన్నారు. జాతీయ స్థాయి నుంచి బీజేపీ ఇస్తున్న సూచనల మేరకు రాష్ట్రంలో పరిస్థితులు నడుచుకుంటున్నాయని.. ఆ రెండు పార్టీలు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి కౌంటర్ స్ట్రేటజీ అవసరమని అన్నారు. కాంగ్రెస్లో అనైక్యత అనేది అందరికీ కనిపిస్తోందని, మిగతా పార్టీల్లోనూ విబేధాలుంటాయి కానీ బయటకు రావని చెప్పారు. పార్టీని ఎలా మెరుగుపర్చాలన్న అంశం మీదే తాను దృష్టి పెట్టానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
-
Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
-
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!