అధిష్టానం ‘హుజురాబాద్’ పోస్టుమార్టం.. ఢిల్లీకి టి.కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 3 వేలకు పరిమితం కావడం హాట్ టాపిక్గా మారిపోయింది.. దీనిపై కాంగ్రెస్ పార్టీలో దుమారమే రేగింది.. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు కొందరు సీనియర్లు.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది.. దీనికోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.
Read Also: ‘గేట్ వే’పై సైబర్ ఎటాక్.. కోట్లలో కొట్టేశారు..!
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
దీంతో.. హుజురాబాద్ ఉప ఎన్నిక పంచాయతీ హస్తినకు చేరినట్టు అయ్యింది.. ఈ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేయడానికి ఎన్నికల్లోపనిచేసిన బాధ్యతుల ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, వీహెచ్లకు పిలుపు వచ్చింది. దీంతో నేతలందరూ ఢిల్లీకి పయనం అయ్యారు.. రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలతో సమావేశం కానున్నారు.. హుజురాబాద్ ఎన్నికల్లో ఎవరెవరు ఏం చేశారు? పార్టీకి నష్టం కలిగించిన అంశాలు ఏంటి? ఇలా అన్ని అంశాలతో నివేదికతో రావాలని అధిష్టానం సూచించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వెంకట్ కూడా పార్టీ నేతలపై నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. పార్టీకి నష్టం కలిగించిన కరీంనగర్ జిల్లా నాయకులు, హుజురాబాద్లో నాయకుల పరిస్థితి, ఓట్లు ఎందుకు పడలేదు అనే అంశాలపై హై కమాండ్ నివేదిక కోరినట్టు సమాచారం. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎలాంటి నివేదిక ఇస్తారు… మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి అంశాలు తెరపైకి తెస్తారు.. సీనియర్లు అధిష్టానానికి ఎవ్వరిపై ఫిర్యాదులు చేస్తారు అనే ది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!