Telangana Congress: కాంగ్రెస్ లో చెలరేగిన చిచ్చు.. రేపు సీనియర్ల భేటీపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చీలిక అనేక మలుపులు తిరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్లు ఒక్కటయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ.. వలస నేతలతో పాటు అసలు కాంగ్రెస్ వాళ్లకు కూడా అన్యాయం జరుగుతుందనే ఉమ్మడి స్వరం వినిపించింది. అసలు కాంగ్రెస్ వాళ్లదేనన్నారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మరోవైపు ఆదివారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ సమావేశానికి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేతలు హాజరుకాలేదు.
Read also: CM YS Jagan: రేపు ప్రకాశం జిల్లాకు సీఎం జగన్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
సీనియర్ నేతల వ్యాఖ్యలపై రేవంత్ వర్గం నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేపథ్యానికి చెందిన 12 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్లో చేరి నాలుగేళ్లు అయిందని సీనియర్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలను తెలంగాణ ఇన్ఛార్జ్ కార్యదర్శులు కాంగ్రెస్ హైకమాండ్కు నివేదించారు.ఈ క్రమంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా పరిశీలించనుంది. అసంతృప్త నేతలతో సమావేశం కావాలని ఇంచార్జి కార్యదర్శులకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న నదీమ్ జావిద్ ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
Read also: Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్ని నిర్మింధించి..
కానీ సీనియర్ నేతలు మాత్రం పట్టు వదలడం లేదు. పార్టీలో సమస్యలుంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సీనియర్లకు హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.అలాగే సమస్యలుంటే మీడియా ముందు మాట్లాడవద్దని చెప్పారు. రేపు (మంగళవారం) మరోసారి సమావేశం కావాలని సీనియర్లు నిర్ణయించారు. రేపు సాయంత్రం 4 గంటలకు మహేశ్వర్ రెడ్డి నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదించాల్సిన అంశాల ఎజెండాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే భట్టి విక్రమార్క నివాసానికి తరలివచ్చిన నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఈ సమావేశంలో పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ భేటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Mallu Ravi: రేవంత్ పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు.. నోరుజారితే నాలుచీరేస్తామన్న మల్లురవి
తాజావార్తలు
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..