KTR Tweet: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు.. కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మూడు రోజుల బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని తెలిపారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని తెలిపారు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని ట్విటర్ ద్వారా మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ..ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదన్నారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్., కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? అని ప్రశ్నించారు కేటీఆర్. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను.. కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి..అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమైందని తెలిపారు.
Also Read
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ అన్నారు. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంత్ అని ఆగ్రహం వ్యాఖ్యలు చేశారు. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని అన్నారు. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందన్నారు. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని అన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
Telangana Weather: నవంబర్ వరకు మండనున్న ఎండలు.. ఆ తర్వాతే చలి వాతావరణం
తాజావార్తలు
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!