Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Speech Telangana Rising 2047

CM Revanth Reddy : జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది

Published Date :December 9, 2025 , 10:39 pm
By Gogikar Sai Krishna
  • తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ముగింపులో సీఎం రేవంత్ ప్రసంగం
  • జల్–జంగిల్–జమీన్ పోరాటాల గడ్డగా తెలంగాణ గుర్తింపు
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
  • పేదలు, యువత, అట్టడుగు వర్గాల అభివృద్ధే ప్రాధాన్యం
CM Revanth Reddy : జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ చరిత్ర, పోరాటాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన దార్శనిక ఆలోచనలను ఆయన వెల్లడించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందని, ఇది జల్, జంగిల్, జమీన్ కోసం కొమురం భీమ్ పోరాడిన పవిత్ర గడ్డ అని సీఎం పేర్కొన్నారు.

ఈ నేల భూమి కోసం, బతుకు కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణాలర్పించిన చరిత్ర కలిగి ఉందని సీఎం గుర్తు చేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోందని, ప్రజలు కోరుకున్న ఆ స్వప్నాలను నిజం చేయడానికే తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని తెలిపారు.

2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన పత్రం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను సమీకరించి రూపొందించిన డాక్యుమెంట్ అని స్పష్టం చేశారు.

భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తూ, ఇప్పుడు తమ ప్రభుత్వం విద్య, ఇరిగేషన్, కమ్యూనికేషన్ అనే నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

కొంతమందికి పేదరికం ఒక అనుభవం లేదా ఎక్స్కర్షన్‌లా ఉంటుందని వ్యాఖ్యానించిన సీఎం, తనకు పేదరికం అంటే ఏమిటో బాగా తెలుసన్నారు. తాను గ్రామీణ ప్రాంతానికి చెందినవాడినని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినవాడినని చెప్పారు. పేదలు, దళితులు, ఆదివాసీలతో తనకు బలమైన అనుబంధం ఉందని, వారి కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే తన తపన అని అన్నారు.

విద్యార్థి దశ నుంచే కులవివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. దీన్ని ఖర్చుగా భావించడం లేదని, తెలంగాణ భవిష్యత్తుకు పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు.

నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించిన సీఎం, యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు, ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధే తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్, అసలు సారమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధితో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • revanth reddy speech
  • Telangana Development Vision
  • Telangana Global Summit
  • Telangana Rising 2047

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions