CM Revanth Reddy : జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలి, నిధులు మంజూరు చేయాలి
- విదేశీ పర్యాటకులు కూడా మేడారం వస్తున్నారు
- ప్రతివారం మంత్రి పొంగులేటి మేడారం వచ్చి పనులు పర్యవేక్షిస్తారు
- కుంభమేళాకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది
- మా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు
- యూపీలో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ములుగు జిల్లా మేడారం మహాజాతరలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రగతి అంశాలపై కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాకుండా, భావోద్వేగంతో కూడిన బాధ్యత అని అన్నారు. ఆనాటి పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని విమర్శించారు. “సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోనే నేను పాదయాత్ర మొదలుపెట్టా. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డపై నుంచే తెలంగాణకు పట్టిన చీడ, పీడలను వదిలించేందుకు అడుగులు వేశాం” అని గుర్తుచేసుకున్నారు.
Kakinada : కాకినాడ ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన – సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన
Also Read
ఆదివాసీలు దేశానికి మూలవాసులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఏ సంక్షేమ పథకం అయినా ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నామని అన్నారు. “సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం మా జీవితంలో గొప్ప ఘట్టం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధం. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలందరినీ భాగస్వాములను చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని పేర్కొంటూ, ఆలయ నిర్మాణంలో రాతి కట్టడాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహాజాతరకు ముందే పనులు పూర్తిచేసేలా అధికారులు పగలు, రాత్రి పనిచేయాలని ఆదేశించారు. భక్తితో, సమ్మక్క మాలధారణ చేసినట్లుగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అదే సమయంలో, కేంద్రంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, “కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు నిధులు ఎందుకు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. మహాజాతర సమయంలో తిరిగి వచ్చి, ఈ జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!