T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం బలమైన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లకు బీసీసీఐ ఇప్పటికే సూచనలు చేసింది. అయితే ప్రపంచకప్కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
ఎలాగైనా భారత జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భాగం చేయాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు మెంటార్గా ధోనీకి బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. డ్రెస్సింగ్ రూమ్లో మిస్టర్ కూల్ ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని భావిస్తోందట. ధోనీ అనుభవం, సూచనలను వాడుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోందని సమాచారం. మరి బీసీసీఐ ఆఫర్ను మహీ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 2021 టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు ధోనీ మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
Also Read: SRH vs RCB: ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్పై వేటు!
ఎంఎస్ ధోనీని భారత జట్టు మెంటార్గా నియమించడానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు ముగిసిన అనంతరం ధోనీకి ఆ పదవిలోకి తీసుకురావాలని బీసీసీఐ చూస్తోందట. అందుకే ముందుగా మెంటార్గా బాధ్యతలు అప్పజెప్పి.. ఆపై హెడ్ కోచ్గా పదవి కట్టబెట్టాలని బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసిందట. ఒకవేళ హెడ్ కోచ్గా మహీ ఒప్పుకోకుంటే.. మెంటార్గా అయినా జట్టుతో కొనసాగించి, వీవీఎస్ లక్ష్మణ్ను కోచ్గా ఎంపిక చేయాలని చూస్తోందట. మొత్తానికి ఏదో ఒక పదవి ఇచ్చి ధోనీ భారత జట్టుతో ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!