Revanth Reddy: ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష.. కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో మిగిలిన నాలుగు హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని శాఖలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. మండల కేంద్రంలో నెలకోసారి రెవెన్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ధరణి పేరును భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి సమస్యలపై ఇప్పటికే మీడియాలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
Read also: U19 WC 2024: ఇద్దరు హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు!
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి మెరుగైన ఆదాయ సేవల కోసం ‘భూమాత’ పేరుతో పోర్టల్ను తీసుకువస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేందుకు సమగ్ర భూ హక్కుల సర్వే చేపట్టి హక్కులు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ సర్వే ద్వారా ప్రతి రైతుకు ‘భూధార్ కార్డు’ ఇస్తామని, కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భూములు, భూమి హక్కుల పరిరక్షణకు సమగ్ర రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం భూసంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాల భూమిలో పేదలకు పూర్తి భూమి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరి మధ్య భూ తగాదాలు, వివాదాలు తలెత్తకుండా పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ధ్యేయమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగిస్తామని స్పష్టం చేశారు.
Hyderabad: అత్యుత్తమ నగరంగా హైదరాబాద్.. దేశంలోనే అగ్రస్థానం
తాజావార్తలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!