CM Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.. 4 రోజుల్లో మార్గదర్శకాలు
- రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు
- రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పామన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ ముందుకు తెస్తామని సీఎం తెలిపారు. చర్చల అనంతరం డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచనల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.
Read Also: Medigadda: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు పెరుగుతున్న వరద
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ రెవెన్యూ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో ఆర్టీసీకీ నిర్వహణ నష్టాలు తగ్గాయన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకా ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా.. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని.. కొత్తవారిని నియమించిన అనంతరం కులగణన చేస్తామన్నారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. ప్రతి నెలా రూ.7వేల కోట్ల అప్పులు కడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రుణభారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నామన్నారు. ఒక్క శాతం తగ్గినా రూ.700 కోట్లు ఆదా అవుతాయన్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!