CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు
- లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం
- శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది
- ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
Also Read
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
- OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక INSAS LMG రైఫిల్తో పాటు, 31 AK-47లు, 21 INSAS రైఫిళ్లు, 20 SLR రైఫిళ్లు, , 18 .303 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5,205 తూటాలు, 9mm పిస్టల్స్ , ఇతర పేలుడు పదార్థాలను కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటును సాదరంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరి ఆర్థిక , ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు , ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆయుధాలతో లొంగిపోయే వారికి అత్యుత్తమ పునరావాసం కల్పిస్తామని, ప్రజాస్వామ్య పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!