CM Revanth Reddy: నేడు సచివాలయంలో సీఎం కీలక సమీక్ష.. తడిసిన ధాన్యం సేకరణపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలిసిందే.. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కూడా.. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు.
Read also: Disha Patani: దిశా పటాని వేసుకున్న ‘లవ్’ షార్ట్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం అందించే దిశగా మీద ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలేనని.. బీఆర్ఎస్ అదే చేస్తుందని అన్నారు.
Purandeswari: బస్సు యాక్సిడెంట్లో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!