CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్రెడ్డి కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు విపక్షాలు సమావేశం కావాలని ఆహ్వానించారు. కొత్త రాష్ట్ర చిహ్నం, గీతం గురించి వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ వారికి వివరించనున్నారు. ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
Read also: Harish Rao: మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి.. హరీష్ రావు డిమాండ్
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్ర చిహ్నం, గీతం మార్పులపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహా పార్టీ నేతలు ఎలాంటి మార్పులు చేస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు చిహ్నాలు కాదని, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. దీంతో రాజకీయ పార్టీలతో నిర్వహించనున్న సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తారా? లేక ప్రతిపక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
Read also: Hyderabad: అఖిల్గౌడ్ ను కఠినంగా శిక్షించండి.. అఖిల పేరెంట్స్ డిమాండ్
కాగా.. రాష్ట్ర చిహ్నంలో ఉన్న చార్మినార్, కాకతీయ ఆర్చ్ తొలగించడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. చార్మినార్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ చారిత్రక కట్టడాలను లోగో నుంచి తొలగిస్తే నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం వరంగల్లో ధర్నాకు దిగారు. వ్యక్తిగత ద్వేషంతో సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, మార్పుల జోడింపుపై కమిటీ వేస్తామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన కీరవాణితో రాష్ట్ర గీతం రూపొందించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. లోగో మార్పులపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. అధికారిక చిహ్నాన్ని మార్చడం సాధ్యం కాదు.. కేంద్రం ఆమోదం పొందాలి.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..