CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్రెడ్డి కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు విపక్షాలు సమావేశం కావాలని ఆహ్వానించారు. కొత్త రాష్ట్ర చిహ్నం, గీతం గురించి వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ వారికి వివరించనున్నారు. ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
Read also: Harish Rao: మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి.. హరీష్ రావు డిమాండ్
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
రాష్ట్ర చిహ్నం, గీతం మార్పులపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహా పార్టీ నేతలు ఎలాంటి మార్పులు చేస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు చిహ్నాలు కాదని, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. దీంతో రాజకీయ పార్టీలతో నిర్వహించనున్న సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తారా? లేక ప్రతిపక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
Read also: Hyderabad: అఖిల్గౌడ్ ను కఠినంగా శిక్షించండి.. అఖిల పేరెంట్స్ డిమాండ్
కాగా.. రాష్ట్ర చిహ్నంలో ఉన్న చార్మినార్, కాకతీయ ఆర్చ్ తొలగించడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. చార్మినార్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ చారిత్రక కట్టడాలను లోగో నుంచి తొలగిస్తే నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం వరంగల్లో ధర్నాకు దిగారు. వ్యక్తిగత ద్వేషంతో సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, మార్పుల జోడింపుపై కమిటీ వేస్తామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన కీరవాణితో రాష్ట్ర గీతం రూపొందించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. లోగో మార్పులపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. అధికారిక చిహ్నాన్ని మార్చడం సాధ్యం కాదు.. కేంద్రం ఆమోదం పొందాలి.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!