CM Revanth Reddy : పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. 2 వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకున్నాడు..
- దేవరకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ
- పదేళ్లు తెలంగాణ ప్రజలను పట్టిపీడించిన నాయకులను ఓడించాం
- దేవరకొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా
- నిజాం నవాబులను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ
- కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది
- 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల పేదల ఇళ్లలో వెలుగులు నిండాయి. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చిన ప్రాంతాల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని అన్నారు. ప్రజలే సరైన తీర్పు చెప్తారన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్దే కీలక పాత్ర అని చెబుతూ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, కాంగ్రెస్ గిరిజనుల పార్టీ అని అన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని విమర్శిస్తూ, ప్రజలే ఫ్యూజ్, స్టార్టర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు.
Also Read
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
బీఆర్ఎస్ పాలన అసమర్థమని విమర్శించిన సీఎం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేకపోయారని మండిపడ్డారు. టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందితే, బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. SLBCను పూర్తి చేస్తామని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టం చేసిన సీఎం, వచ్చే రోజుల్లో కూడా ప్రజాహిత కార్యక్రమాలే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని తెలిపారు. దేవరకొండ అభివృద్ధికి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ను దేవరకొండకు పంపిస్తానన్నారు. నర్సింగ్ కాలేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండని, జూనియర్ కాలేజీ అభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేస్తానని సీఎం రేవంత్ అన్నారు.
10 ఏళ్లు నష్టపోయాం. 10 ఏళ్లు కష్టపడ్డాం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది.. రాష్ట్రాన్ని దేశంలోనే no 1 చేసి.. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తం చేస్తాం.. మంచి వాళ్ళను సర్పంచ్ గా ఎన్నుకోండి.. మంత్రితో కలిసి ఉండేవాళ్ళు, MLA తో కలిసి పని చేసే వాళ్లకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ చీరలను వాళ్ల ఇంటికే పంపిస్తా. ఇందిరమ్మ చీర కట్టుకోండి.. సర్పంచ్ కు ఓటేయండి.. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..