CM KCR: రాష్ట్ర సచివాలయంలో ప్రార్థనామందిరాలు.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎంతో కళాత్మకంగా, అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. ఇవాళ మధ్యాహ్నం 12:10 నిమిషాలకు తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన దేవాలయం, చర్చి, మసీదులను గవర్నర్ తమిళి సై దర్శించుకోనున్నారు. మధ్నాహ్నం 12:35కు సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం దేవాలయం, మసీదు, రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి 12:45కు చర్చిలో కేక్ కట్ చేయనున్నారు.
Read also: Kollywood: మా మీద ఈ ఏడుపు ఎందుకు బ్రో?
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు చేపట్టగా, ఆలయ ప్రారంభోత్సవాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గురువారం స్తథాపూజ, ప్రతిష్టాపన హోమం, మహాస్నపనం (తిరుమంజనం), వేదపఠనం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీ యాగం, ప్రాణ ప్రతిష్టాపన హోమం, ధ్వజస్తంభం, యంత్ర, ప్రాణ ప్రతిష్ఠ, వేదోక్తాంగ ప్రాణ ప్రతిష్ఠ, ముక్కోటి ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, శివాలయ తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం, శివాలయ ఇదోళోచ్ఛాచనం తదితర కార్యక్రమాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతలను ప్రతిష్ఠించనున్నారు.
Manipur Violence: మణిపూర్లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
తాజావార్తలు
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..