Telangana Martyrs: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Martyrs: నేటితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి. నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం పంపారు. శంకరమ్మకు పీఏ, గన్మెన్ ను ప్రభుత్వం కేటాయించింది. సాయంత్రం 5.00 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుండి స్మారక చిహ్నం వరకు 6000 మంది కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు. 12 తుపాకులతో అమరవీరులకు తుపాకీ నివాళులర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరజ్యోతిని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత శిఖరాగ్రానికి చేరుకుంటారు. అసెంబ్లీలో అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రముఖ కార్యకర్త, ఎమ్మెల్సీ దేశపతి పాట పాడనున్నారు. అసెంబ్లీలో కొవ్వొత్తులు ప్రదర్శించి 10 వేల మంది అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఎంపికైన ఆరుగురు అమర వీరుల కుటుంబాలకు నివాళులర్పిస్తారు. 800 డ్రోన్లతో ప్రదర్శన , అమరవీరుల కోసం జోహార్ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్ షో ఏర్పాటు చేశారు.
Read also: Anchor Lasya : వంటలక్కగా మారిన లాస్య.. కట్టెల పొయ్యి పై కష్టపడుతూ…
Also Read
స్మారక చిహ్నం యొక్క మెరుగుపెట్టిన వెలుపలి భాగం పశ్చిమ చైనీస్ నగరం కరామేలోని ‘క్లౌడ్ గేట్’ మరియు చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పించే సాంప్రదాయక మట్టి నూనె దీపాన్ని పోలి ఉండడం విశేషం. 161 అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ‘క్లౌడ్ గేట్’ కంటే ఐదు నుంచి ఆరు రెట్లు పెద్దది. ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. హుస్సేన్సాగర్ ఒడ్డున నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చిహ్నం మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. ఒకవైపు అత్యంత ఆకర్షణీయమైన సచివాలయం, మరోవైపు ఆహ్లాదకరమైన పరిసరాలైన హుస్సేన్సాగర్, బుద్ధ విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, అమరవీరుల స్మారకం హైదరాబాద్ నగరానికి మరింత శోభను చేకూరుస్తాయనడంలో సందేహం లేదు.
Earthquake: మయన్మార్లో వరస భూకంపాలు.. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రత నమోదు..
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో.. నేడు ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయం పరిసర ప్రాంతాల్లోని పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. పార్కుల వద్దకు వచ్చే ప్రజలకు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్లను మూసివేయనున్నట్టు తెలిపారు. రేపు ఉదయం నుంచే అమలులో ఉంటాయని పేర్కొంది. అంతే కాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని ప్రయాణికులు ప్రత్యాన్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించింది.
Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్లో తులం ఎంతంటే?
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!