Earthquake: మయన్మార్లో వరస మూడు భూకంపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: భారత సరిహద్దు దేశం మయన్మార్ వరసగా భూకంపాలతో వణుకుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి వరసగా మూడు భూకంపాలు నమోదయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు యాంగాన్ లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది. యాంగాన్ కు 174 కిలోమీటర్ల దూరంలో భూమికి 48కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైంది.
Read Also: PM Modi US Visit: ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జో బైడెన్.. వైట్హౌస్లో విందు..
Also Read
గురువారం తెల్లవారుజామున 3 గంటలకు 4.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో, యాంగూన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తించారు. దీనికి కొన్ని గంటల ముందు బుధవారం అర్థరాత్రి 11.57 గంటలకు తొలి భూకంపం వచ్చింది. వరసగా కొన్ని గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మూడు భూకంపాలు కూడా రిక్టర్ స్కేలుపై 4 కన్నా ఎక్కవ తీవ్రతతో సంభవించాయి. దీని వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. ఇండియన్ ప్లేయర్ కళ్లలో మెరిసిన భావోద్వేగపు సంతకం..
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?