Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Speech At Medchal Malkajgiri Public Meeting

CM KCR Medchal Meeting: తెలంగాణలో 24 గంటలు కరెంట్ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ రాదు

Published Date :August 17, 2022 , 5:16 pm
By NTV WebDesk
CM KCR Medchal Meeting: తెలంగాణలో 24 గంటలు కరెంట్ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ రాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR Speech At Medchal Malkajgiri Event: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 గంటలు కరెంట్ పోదు.. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటలు కరెంట్ రాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలో ఎక్కడా కరెంట్ ఉండేది కానీ, ఇప్పుడు మాత్రం 24 గంటల కరెంట్ వస్తోందని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. 75 ఏళ్ల నుండి అసమర్థ పాలన వల్ల దేశంలో కరెంట్ సమస్య ఏర్పడిందని.. ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదని పేర్కొన్నారు. దేశంలో జరిగే రాజకీయాల గురించి కేవలం టీవీల్లో చూడటం, పేపర్లలో చదవడం కాదు.. గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకోవాలని అన్నారు.

కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని.. అందుకు భిన్నంగా మనం ఐక్యతగా మెలగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చైనా, సింగపూర్, కొరియా లాంటి దేశాల్లాగే.. మన భారతదేశం కూడా ఎదగాలన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. ఢిల్లీలో మంచి నీళ్ళు కొనేంత దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో మంచి నీళ్లు లభ్యమవుతున్నప్పుడు, దేశ రాజధాని అయిన ఢిల్లీలో మంచి నీళ్లు లేకపోవడమేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు, దుర్మార్గులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని.. దీనిపై మీరంతా (ప్రజల్ని ఉద్దేశిస్తూ) చర్చించుకోవాలని, వాళ్లని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎవడో వచ్చి ఏదో చెప్తాడని, అది మనకు మంచి కాదని, ఏమరుపాటుగా ఉంటే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.

Also Read

  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
  • Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
  • TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

మేడ్చల్ జిల్లా ఏర్పాటు, పరిపాలన భవనం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. అసలు మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మేడ్చల్ జిల్లా సాకారం చేసుకున్నామన్నారు. రైతు వేదికలు, ఏఈఓలను నియమించామని.. పరిపాలన వికేంద్రీకరణ జరగడం వల్లే ఇన్ని భవనాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు లబాసాటిగా మారాయన్నారు. 57 ఏళ్ల వారికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను పెంచి, మేడ్చల్ జిల్లా పరిధిలో కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న 5కోట్లకు అదనంగా మరో 10 కోట్లు ఎమ్మెల్యే ఫండ్ కింద ఇచ్చి, రేపే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగిందన్నారు.

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద 11 లక్షల మంది లబ్ది పొందారని కేసీఆర్ వెల్లడించారు. ఆసరా పెన్షన్ నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్నాడని తెలంగాణలో ప్రతిఒక్కరూ గర్వంగా చెప్తున్నారన్నారు. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే.. ఈపాటికి రాష్ట్రంలో 500 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించేవాళ్లమన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారని, ఇప్పుడు 12 రాష్ట్రాల నుండి కార్మికులు తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు. 60 ఏళ్ల కింద నిద్రపోయి ఉండే తెలంగాణ రాష్ట్రానికి పోరాడి తెచ్చుకున్నామన్నారు. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో.. అది సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM KCR Speech
  • KCR Public Meeting
  • Medchal Malkajgiri
  • TRS Public Meeting

తాజావార్తలు

  • Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!

  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..

  • AP SSC Results 2026: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

ట్రెండింగ్‌

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions