Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Rangareddy Visit Was Cancelled

CM KCR: కేసీఆర్‌ రంగారెడ్డి పర్యటన రద్దు..! సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన మంత్రులు

Published Date :October 6, 2023 , 10:08 am
By NTV WebDesk
CM KCR: కేసీఆర్‌ రంగారెడ్డి పర్యటన రద్దు..! సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన మంత్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గానికి 119 పాఠశాలల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో వైద్య, దేవాదాయ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి బదులు మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తుందని హరీశ్ రావు అన్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో లాంటి టిఫిన్ తింటారో అలాంటి టిఫిన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని సీఎం ఆలోచించారు. ఒకటి నుంచి పది వరకు పిల్లలకు ఉదయం అల్పాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఏ సంక్షేమం అమలు చేసినా అందులో మానవీయ కోణం ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ ద్వారా ఆసుపత్రుల్లో 100 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, తద్వారా మాతా శిశు మరణాలు తగ్గుముఖం పడతాయన్నారు. అల్పాహారం ద్వారా డ్రాపౌట్స్ తగ్గుతాయని, పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వినియోగిస్తామన్నారు. 9, 10 ఏళ్ల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణలోనూ అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ఏ రాష్ట్రం పటిష్టం చేయలేదన్నారు. తెలంగాణలో వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు.

దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల్లో అల్పాహార పథకం అమలుతో 1 నుంచి 10వ తరగతి వరకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, పౌష్టికాహారం అందించడం ద్వారా పిల్లల శారీరక ఎదుగుదల, తల్లిదండ్రులపై భారం తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. . ఈ పథకాన్ని పొందుతున్న విద్యార్థుల వివరాలను మొబైల్ యాప్ మరియు ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా సేకరిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అల్పాహారం నాణ్యతను ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పరిశీలిస్తారని మంత్రి తెలిపారు.
Minister KTR: నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • CM KCR Rangareddy visit
  • CM KCR Rangareddy visit was cancelled
  • Minister KTR
  • Minister Sabitha Indra Reddy

తాజావార్తలు

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions