CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ.. అదే కారణమా..?
CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈరోజు సమావేశం జరగనుంది. గజ్వేల్లో నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్లుగా మంత్రి హరీశ్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలను ముఖ్యమంత్రి ఇప్పటికే నియమించారు. ఈరోజు జరిగే సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితోపాటు ముఖ్య నేతలు పాల్గొంటారని సమాచారం.
ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి ఉండడంతో సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయలేక పోతున్నారు. అందుకే ఈ సమావేశానికి ఒక్కో గ్రామం నుంచి సుమారు 20 నుంచి 25 మంది కీలక కార్యకర్తలను పిలిపించి ప్రచార బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో గజ్వేల్కు చెందిన పలువురు నేతలు ఈటెలతో సంప్రదింపులు జరిపినట్లు తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈటల ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, నియోజకవర్గంలో 50 వేలకు పైగా ముదిరాజ్ ఓట్లు ఉండడంతో కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. నియోజకవర్గంలో పలువురు ముదిరాజ్ కులస్తులు ఈటెలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు కూడా సమావేశాలు పెట్టి ఎన్నికలకు మద్దతిస్తామని బహిరంగంగానే ప్రకటించారు.
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ఈ నేప థ్యంలో ముఖ్య మంత్రి ఈ కీల క కార్య క ర్త ల స మావేశం నిర్వ హించ డం ప్రాధాన్యం సంత రించుకుంది. ముఖ్యమంత్రి 2004 వరకు సిద్దిపేట నుంచి పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆ తర్వాత రెండు దఫాలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి హరీశ్ రావును రంగంలోకి దించారు. 2014లో తెలంగాణకు వచ్చిన తర్వాత గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి గజ్వేల్తో పాటు ముఖ్యమంత్రి కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
Dr. Laxman: మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణ లిస్టు ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్
తాజావార్తలు
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!