Kollur: 2BHK ఇళ్లను ప్రారంభించిన సీఎం.. టౌన్ షిప్ కి కేసీఆర్ నగర్ గా నామకరణం
Kollur: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం కేసీఆర్ వీక్షించారు. టౌన్షిప్కి “కేసీఆర్ నగర్” అని పేరు పెట్టారు. సీఎం చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను అందుకున్నారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఇవాల ఉదయం కొల్లూరు చేరుకున్న సీఎం డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ఆవరణలో మొక్కలు నాటారు.
Read also: New Delhi: జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
అనంతరం టౌన్షిప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించారు. మొత్తం 145 ఎకరాల్లో రూ.1432.50 కోట్లతో 15,600 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు.G+9 నుండి G+10 , G+11 అంతస్తుల వరకు టౌన్షిప్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 117 బ్లాకులు, ఒక్కో బ్లాక్కు 2 లిఫ్టులు, మొత్తం 234 లిఫ్టులు ఏర్పాటు చేశారు. టౌన్షిప్లో మురుగునీటి శుద్ధి కేంద్రం, పాఠశాలలు, 118 వాణిజ్య దుకాణాలు నిర్మించారు. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శంకర్పల్లి మండలం కొండకల్లో దాదాపు 100 ఎకరాల స్థలంలో 1000 కోట్ల పెట్టుబడితో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మేధా సంస్థ నిర్మించింది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనుంది. ప్రతి ఏటా 500 రైల్వేకోచ్ లు, 50 లోకోమోటివ్ లు ఉత్పత్తి చేసేలా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Uddhav Thackeray: ఠాక్రే, అంబేద్కర్ ఫోటోల పక్కన ఔరంగజేబు.. మహారాష్ట్రలో సరికొత్త వివాదం..
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!