మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్నితీసుకురాబోతున్నట్లు సమాచారం. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 2,016 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే దీనికోసం రాష్ర్ట ఖజనాపై ఎంత భారం పడుతుందనే దానిపై సర్కార్ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్.. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
Read Also: ఏపీలో మూడు వేలు దాటిన కరోనా కేసులు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
రైతుబంధుతో ఇప్పటికే 50 వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు భీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేస్తోంది.రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయతీ నడుస్తున్న ఈ సమయంలో కొత్త పథకంతో మరోసారి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొవచ్చనే భావనతో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడులకు దిగుతోంది. దీంతో వారికి చెక్ పెట్టడంతో పాటు రైతులకు మేలు జరిగేలా ఈ పథకానికి వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఈ పథకం అమలైయితే చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఊరట లభించనుంది.
- Tags
- farmars
- kcr
- new scheme
- telangana
- TRS
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!