Karnataka: రోడ్డు ప్రమాదంలో మృతులకు రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రం కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థీవదేహాలను వారి స్వస్థలానికి తరలించడం.. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కర్ణాటక బస్సు ప్రమాదంల దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం 16 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని.. కొందర్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తామని తలసాని అన్నారు. కర్ణాటక అధికారులతో సీఎం కేసీఆర్, సీఎస్ మాట్లాడారని వెల్లడించారు. బాధిత కుటుంబాలు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉన్నారని..వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున పరామర్శిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
శుక్రవారం ఉదయం కలబురిగి జిల్లా కమలాపురలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కును బస్సు ఢీ కొట్టడంతో బస్సుల ప్రయాణిస్తున్న 32 మందిలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో నలుగురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మొత్తంగా 8 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?