BRS Fight: బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు.. తెలంగాణ భవన్ వేదికగా గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Fight: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఎంపీ సీట్లు సాధించి తన ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫిలత్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
Read also: Telangana : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని వార్తలు వచ్చాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీశ్ రావు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రివ్యూ మీటింగ్ లో బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరు నేతలకు హరీష్ రావు సర్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పైలట్కి, ముధాత్కి పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి.. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఫైలట్ కూడా ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు పెరిగాయి. ఎన్నికల్లో పట్నం ఓడిపోయిందని రోహిత్ వర్గం చెబుతుండగా, మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే పట్నం గెలిచి ఉండేదని ఆయన వర్గం అభిప్రాయపడింది. అయితే.. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ లో గొడవపడటం చర్చకు దారి తీస్తోంది.
CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!