BRS Fight: బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు.. తెలంగాణ భవన్ వేదికగా గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Fight: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఎంపీ సీట్లు సాధించి తన ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫిలత్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
Read also: Telangana : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని వార్తలు వచ్చాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీశ్ రావు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రివ్యూ మీటింగ్ లో బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరు నేతలకు హరీష్ రావు సర్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పైలట్కి, ముధాత్కి పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి.. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఫైలట్ కూడా ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు పెరిగాయి. ఎన్నికల్లో పట్నం ఓడిపోయిందని రోహిత్ వర్గం చెబుతుండగా, మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే పట్నం గెలిచి ఉండేదని ఆయన వర్గం అభిప్రాయపడింది. అయితే.. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ లో గొడవపడటం చర్చకు దారి తీస్తోంది.
CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!