BRS Fight: బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు.. తెలంగాణ భవన్ వేదికగా గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Fight: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఎంపీ సీట్లు సాధించి తన ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫిలత్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
Read also: Telangana : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని వార్తలు వచ్చాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీశ్ రావు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రివ్యూ మీటింగ్ లో బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరు నేతలకు హరీష్ రావు సర్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పైలట్కి, ముధాత్కి పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి.. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఫైలట్ కూడా ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు పెరిగాయి. ఎన్నికల్లో పట్నం ఓడిపోయిందని రోహిత్ వర్గం చెబుతుండగా, మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే పట్నం గెలిచి ఉండేదని ఆయన వర్గం అభిప్రాయపడింది. అయితే.. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ లో గొడవపడటం చర్చకు దారి తీస్తోంది.
CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?