CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. సంక్షేమంతోపాటు ఇతర విషయాలపై కూడా సీఎం రేవంత్ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కొత్త హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని కేటాయించారు. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని MHRDలో కలిశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హైకోర్టు నూతన భవనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరగనున్నాయి. కొహైకోర్టును అక్కడికి తరలించిన తర్వాత పాత భవనాన్ని వారసత్వ భవనంగా పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని సిటీ కోర్టు లేదా మరేదైనా కోర్టు భవనానికి వినియోగించాలని సీఎస్ శాంతకుమారిని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలం బుద్వేల్ గ్రామంలో ఉంది. ఇక్కడ 1966లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2,500 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అదే స్థలంలో వంద ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. కాగా, కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించడంపై హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే..!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!