CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. సంక్షేమంతోపాటు ఇతర విషయాలపై కూడా సీఎం రేవంత్ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కొత్త హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని కేటాయించారు. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని MHRDలో కలిశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హైకోర్టు నూతన భవనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
Also Read
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరగనున్నాయి. కొహైకోర్టును అక్కడికి తరలించిన తర్వాత పాత భవనాన్ని వారసత్వ భవనంగా పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని సిటీ కోర్టు లేదా మరేదైనా కోర్టు భవనానికి వినియోగించాలని సీఎస్ శాంతకుమారిని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలం బుద్వేల్ గ్రామంలో ఉంది. ఇక్కడ 1966లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2,500 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అదే స్థలంలో వంద ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. కాగా, కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించడంపై హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే..!
తాజావార్తలు
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!