Delhi Liquor Scam: కవితకు ఊరట.. ఆ బీజేపీ నేతలకు కోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
City Civil Court Sent Notice To Parvesh Sharma Manjindar Singh Sirsa In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కామ్లో కవితదే ముఖ్యపాత్ర అంటూ ఆరోపణలు చేసిన ప్రతివాదులు బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని.. సోషల్ మీడియా, మీడియా ముందు ఎవ్వరూ స్పందించకూడదని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే! ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఇలాంటి అక్రమ పద్ధతుల్ని ఎంచుకున్నారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. అటు.. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడం వల్లే మీడియాలో కథనాలు వచ్చాయని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రెడ్డి వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ద్వారా నాలుగున్నర కోట్లు మనీష్ సిసోడియాకు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలని.. కానీ వాళ్లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కడిగేశారు.
Also Read
ఈ నేపథ్యంలోనే పలు మీడియాలో వచ్చిన కథనాల్ని, ఆగస్టు 21 తేదీన మీడియా సమావేశంలో ఆ ఇద్దరు బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోలను మోహిత్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రతివాదులు కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ వాదనలు విన్న అనంతరం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ పర్వేశ్ శర్మ, మంజిందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు ఇచ్చింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!