Fake Passport and Visa: నకిలీ వీసా. పాస్పోర్టులు ముఠా.. సీఐడీ కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Passport and Visa: పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్పోర్టులు జారీ చేస్తున్న ముఠాను సీఐడీ అధికారులు పట్టుకున్నారు. ఐదు జిల్లాల్లో సీఐడీ అధికారులు మూకుమ్మడి సోదాలు నిర్వహించారు. తెలంగాణలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల నిజామాబాద్, కరీంనగర్లో సోదాలు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లతో పాస్ పోర్టులు ఇస్తున్న ముఠా చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశీయులు పాస్పోర్టులు పొందేందుకు నకిలీ పత్రాలు సిద్ధం చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో ఈ ముఠా పాస్పోర్టు స్లాట్లను బుక్ చేస్తుంది.
Read also: Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!
Also Read
ఇప్పటి వరకు 100 మంది విదేశీయులకు భారతీయ పాస్పోర్టులు ఇచ్చారు. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 108 పాస్ పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరిని అరెస్టు చేశారు. జవహరితో పాటు మరో 11 మందిని సీఐడీ బృందం అరెస్ట్ చేసింది. శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు ఈ ముఠా పాస్పోర్టులు ఇస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
Read also:Anupama Parameswaran: ముక్కుపోగుతో సరికొత్త పోజులతో అలరిస్తున్న అనుపమ పరమేశ్వరన్…
దుబాయ్ నుంచి వచ్చిన సాదికుల్లా బేగ్ను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. అరెస్టు గురించి తెలియజేస్తూ, లూథియానాలో నకిలీ వీసా కేసులో బేగ్ పేరు బయటకు రావడంతో అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజీఐ) ఉషా రంగాని తెలిపారు. అతను భారతదేశంలోకి దిగిన వెంటనే బెంగళూరు విమానాశ్రయ సిబ్బంది భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు, ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు రంగనాని తెలిపారు. నకిలీ వీసా కేసును ప్రస్తావిస్తూ, లూథియానాకు చెందిన హర్విందర్ సింగ్ ధనోవా అనే ప్రయాణీకుడు కొన్ని నెలల క్రితం ముస్కాన్ అలియాస్ మన్ప్రీత్ కౌర్ అనే ఏజెంట్ అందించిన నకిలీ కెనడియన్ వీసాపై ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మన్ప్రీత్ను పోలీసులు అరెస్టు చేశారు, ఆమె బెంగళూరుకు చెందిన మరో ఏజెంట్ సాదికుల్లా బేగ్కు ₹ 5 లక్షలు చెల్లించినట్లు వెల్లడించినట్లు అధికారి తెలిపారు.
Sameer Hospital: మత్తు ఇంజక్షన్ నిల్వ.. సమీర్ ఆస్పత్రి చైర్మన్ అరెస్ట్..
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?