Telugu Desam Party: రేపు ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభ.. హాజరుకానున్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Desam Party: తెలంగాణలో డీలా పడ్డ టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాస్త బలం ఉన్న ఖమ్మం వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ గ్రౌండ్లో టీడీపీ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో ఈ సభకు ఆయన వెళ్లనున్నారు. ఖమ్మంలో నిర్వహించబోయే సభకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
Read Also: Mancherial Six Died Case: ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి…
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్ఎస్లో చేరగా, విభజన తర్వాత మరికొందరు కాంగ్రెస్ పార్టీ బాటపట్టారు. దీంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాలో కూడా టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇప్పటికీ క్యాడర్ ఉంది. పార్టీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ఖమ్మం నుంచి వచ్చే ఎన్నికల కోసం టీటీడీపీని బలోపేతం చేసే చర్యలను బాబు చేపట్టారు. ఖమ్మం సభ విజయవంతం అయితే రానన్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో 15 సీట్లు గెలిచిన టీడీపీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!