ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు: చాడా వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సేవకులు కనుమరుగు అవుతున్నారన్నారు. ప్రజాధనం లూటీ చేసే వాళ్లే రాజ్యం ఏలుతున్నారన్నారు. వామపక్షాలు బలహీన పడ్డాయి..అందుకే దేశంలో అరాచకం పెరిగిందని చాడా వ్యాఖ్యానించారు.
సీపీఐ, సీపీఎం భావసారుప్యత ఉన్న పార్టీలని చాడ అన్నారు. వామపక్షాల ఐక్యతే కాదు.. పునరేకీకరణ కూడా జరగాలన్నారు. రెండు లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకులు అందుకు అడుగులు వేసే దిశగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల లెఫ్ట్ పార్టీల విధానం ఒక్కటేనని స్పష్టం చేశారు. వామపక్షాలు ఎప్పటికీ ప్రజల పక్షాన్నే నిలబడుతుందన్నారు. సీట్లు లేకపోయినా క్రెడిబులీటీ ఉన్న పార్టీ మనది అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మన ఐక్యతా పెంచుకుని.. పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. వర్గ పోరాటాలు మొదలు పెట్టాలని చాడ అన్నారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
Read Also: ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తుంది: సీతారాం ఏచూరి
రెండు రాష్ట్రాల్లో వనరులు దోపిడికి గురవుతున్నాయి: సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో వనరులు దోపిడికి గురవుతున్నాయన్నారు. వామపక్షాలకు పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేంద్రంతో దోబూచులాటలు ఆడుతు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయన్నారు. పోరాటం చేయడమే మర్చిపోయరని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!